పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజి కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా పూర్తి క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనుంది. ‘తుఫాన్ ఆగిపోయింది.. ఇప్పుడు గాలి వీస్తోంది’ అంటూ సెకండ్ సింగిల్పై అంచనాలు పెంచేసింది. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఐతే, ఈ వారం సెట్స్లోపవన్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దీంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అన్నట్టు హీరో-విలన్ మధ్య సీన్స్ షూటింగ్ పూర్తి అవ్వాల్సి ఉంది. మరి ఈ సీన్స్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.