సీనియర్ హీరోయిన్ కుష్బూ సుందర్ కి సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు కుష్బూ సుందర్ కూతురు అవంతిక తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. అవంతికకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం క్రేజీగా గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఐతే, ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటుంది. కాగా తాజాగా తన తల్లిలాగే అవంతిక సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం అవంతిక ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఆ మధ్య అవంతిక తన నటనా కెరీర్ గురించి గతంలో మాట్లాడుతూ.. నాకు నటించాలని మనసులో ఉంది. ఐతే, ఎప్పుడూ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు’ అని అవంతిక తెలిపింది. దర్శకుడు సుందర్ ను కుష్బూ లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుర్లు. ఎలాగూ సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమైపోయింది. ఈ క్రమంలోనే అవంతిక హీరోయిన్గా పరిచయం కాబోతుందని టాక్.
కాగా తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కుష్బూ కూతురు ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది అని వార్తలు రావడంతో అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు.