టాలీవుడ్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన చిత్రం ‘కుబేర’ సాలిడ్ రెస్పాన్స్తో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కంటిన్యూ చేస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన మార్క్తో ఈ సినిమాను రూపొందించగా.. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లాంటి స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమాలో నటించారు. ఇక ఎమోషనల్ రైడ్గా ఈ చిత్రాన్ని మేకర్స్ తీర్చిదిద్దడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు.
ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కూడా భారీగా వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. తాజాగా మేకర్స్ ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. చాలా రోజుల తర్వాత టాలీవుడ్లో వంద కోట్ల పోస్టర్ను చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.
ఇక ఈ సినిమాకు టాలీవుడ్ బాక్సాఫీస్తో పాటు ఓవర్సీస్ మార్కెట్లోనూ సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా టోటల్ రన్లో ఎంతమేర వసూళ్లు రాబడుతుందో చూడాలి.