బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటించిన రీసెంట్ మూవీ ‘జాట్’ ఏప్రిల్ 10న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. దీంతో ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది.
ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఈసారి జాట్ మేకర్స్ తెలుగు ఆడియన్స్కు ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయిన ‘జాట్’ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు.
దీంతో ఈ సినిమాలోని మాస్ డైలాగులు ఇక తెలుగులోనూ పేలనున్నాయి. ఈ చిత్రానికి థమన్ టెర్రిఫిక్ సంగీతం అందించాడు. మరి బాలీవుడ్ ‘జాట్’ తెలుగు ఓటీటీ ఆడియన్స్ను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.