‘తెల్లవారితే గురువారం’ అంటున్న శ్రీ సింహ

‘తెల్లవారితే గురువారం’ అంటున్న శ్రీ సింహ

Published on Jan 14, 2021 11:17 PM IST

‘మత్తువదలరా’తో హీరోగా పరిచయమయ్యాడు సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి. ఈ సినిమాలో ఆతని నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా కూడ మంచి విజయాన్ని అందుకుంది. మొదటి చిత్రంతోనే కథల విషయంలో తన భిన్నమైన అభిరుచిని తెలియజేసిన శ్రీసింహ రెండవ సినిమా విషయంలో కూడ అదే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు.

తాజాగా ఆయన రెండవ సినిమా అదికారికంగా ప్రకటించబడింది. అదే ‘తెల్లవారితే గురువారం’. టైటిల్ చూస్తే ఈ సినిమా కథ కూడ ‘మత్తువదలరా’ తరహాలోనే చాలా షార్ట్ పిరియడ్లో జరుగుతుందేమో అనిపిస్తుంది. పైగా టైటిల్లో సస్పెన్స్ వినిపిస్తోంది. అంటే ఇది కూడ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ అయ్యుంటుందని అనుకుంటున్నారు ప్రేక్షకులు. నూతన దర్శకుడు మనికాంత్ గెల్లి‌ దర్శకత్వంలో సాయి కొర్రపాటితో కలిసి రజినీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రా శుక్ల, మిషా నారంగ్‌ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. కాల భైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు