సీనియర్ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం సినీ రంగానికి దూరంగా ఉంది. పైగా ఇప్పటికే, 2023లో పండంటి బాబుకు జన్మనిచ్చింది.తాజాగా ఆమె ఇన్స్టా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు బదులిస్తూ.. తన రీఎంట్రీ గురించి కూడా చెప్పింది. ఓ నెటిజన్.. ఆమె నటించిన ఓ హిట్ మూవీ సీక్వెల్ గురించి ప్రశ్నిస్తూ.. ‘‘మేడమ్.. ‘రైడ్ 2’ సినిమాలో మీరెందుకు నటించలేదు? మీ కమ్బ్యాక్ ఎప్పుడు ఉంటుంది?’’ అని ఆ నెటిజన్ అడిగాడు.
ఆ ప్రశ్నకు ఇలియానా సమాధానమిస్తూ..‘సినిమాలను నేనెంతో మిస్ అవుతున్నా. నాక్కూడా ఆ సినిమాలో భాగం కావాలనిపించింది. ‘రైడ్’ నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. మాలిని పాత్రలో మరోసారి ఒదిగిపోవాలనుకున్నా. మా దర్శకుడు రాజ్కుమార్ గుప్తా, నటుడు అజయ్ దేవ్గణ్తో కలిసి వర్క్ చేయాలని నాక్కూడా ఉంది. నిజం చెప్పాలంటే, సీక్వెల్ తెరకెక్కించాలనుకున్నప్పుడు టీమ్ నన్ను సంప్రదించింది. మళ్లీ యాక్ట్ చేయమని అడిగింది. కాకపోతే, అదే సమయంలో నాకు బాబు పుట్టాడు.దానివల్ల నా ప్రాధాన్యతలు మారి ఆ సినిమా చేయలేకపోయాను. ‘భవిష్యత్తులో సినిమాల్లోకి తప్పకుండా వస్తానని ఇలియానా బదులిచ్చింది.