ఆ సంతోషాన్ని ఇకదేనిలోనూ పొందలేము.!


‘సిరివెన్నెల’ సినిమాతో తన కవితా హృదయాన్ని తెలుగు వారికి పరిచయం చేసి ఆ సినిమా పేరుని తన ఇంటిపేరుగా మార్చుకున్న సీతారామ శాస్త్రి సాహిత్యానికికి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఇటీవల’ కృష్ణం వందే జగద్గురుమ్’ కోసం రాసిన దశావతార రూపకం అందరికీ బాగా నచ్చింది. ఈయన క్రిష్ తో చెప్పిన కొన్ని మాటలకి ప్రతిరూపమే ఈ సినిమా. నవంబర్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. అవార్డులపై మీకున్న అభిప్రాయం ఏమిటి అని అడిగితే సీతారామ శాస్త్రి మాట్లాడుతూ ‘ నేను పాటలన్నీ ఎక్కువగా రాత్రి వేళల్లో రాస్తాను. నేను రాస్తున్న పాట రాత్రి ఏ ఒంటి గంటకో, రెండు గంటలకో పూర్తయినప్పుడు, అది నేను అనుకున్న విధంగా వచ్చినప్పుడు నాకు నేనే భుజం తట్టుకున్నప్పుడు కలిగే సంతోషాన్ని మరియు సంతృప్తిని ఇకదేనిలోనూ పొందలేను మరియు ఎన్ని అవార్డులిచ్చినా అంత సంతోషం మళ్ళీ కలగదు. మనచేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను ఇస్తే తీసుకుంటాను అంతే కానీ నాకెందుకు అవార్డు ఇవ్వలేదని అడగనని’ అన్నారు.

Exit mobile version