మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు భాను భోగవరపు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీని చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుంది. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రాలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమాను వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.
ఇక ఈ సినిమా తర్వాత రవితేజ తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన ప్రస్తుతం ‘మజాకా’ అనే సినిమాతో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్, రీతూ వర్మ హీరోహిరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు త్రినాథరావు మాట్లాడుతూ.. తన నెక్స్ట్ చిత్రాన్ని మాస్ రాజా రవితేజతో చేసేందుకు సిద్ధమయ్యినట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే రవితేజకు తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన కథను వినిపించానని.. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు ఆయన వెల్లడించాడు. ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘ధమాకా’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో మరోసారి వీరి కాంబినేషన్లో రాబోయే సినిమా ఖచ్చితంగా డబుల్ ధమాకా అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.