పూరి అలా చేశాడన్నది అబద్దం- ఛార్మి.

పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండల కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెసిందే. ఫైటింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేస్తున్నాడు. చాల త్వరగా సినిమాలు పూర్తి చేసే పూరి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ముగించాడు. లాక్ డౌన్ నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితుల వలన ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేశారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ముంబైలో జరగాల్సింవుంది. ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దానికి తోడు అక్కడ షూటింగ్స్ నిర్వహణకు అనుమతి లేదు. దీనితో పూరి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారని వార్తలు వచ్చాయి. ఐతే ఈ విషయంపై నిర్మాత ఛార్మి క్లారిటీ ఇచ్చింది. ఫైటర్ మూవీ స్క్రిప్ట్ లో ఎటువంటి మార్పులు జరగలేదని ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి తెలియజేసింది. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version