అక్టోబర్ లో రానున్న ‘ఎవడు’

అక్టోబర్ లో రానున్న ‘ఎవడు’

Published on Aug 13, 2013 3:49 PM IST

yevadu-audio-review

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమా విడుదల తేది ఖరారయ్యింది. ఈ సినిమాని అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు ఈ సినిమా పీఆర్ఓ తెలియజేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించారు. వక్కంతం వంశీ స్క్రిప్ట్ ను అందించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు అతిధి పాత్రలో కనిపించనున్నారు.

తాజా వార్తలు