వైవిధ్యమైన చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు హీరో అడివి శేషు. ఆయన భిన్నమైన చిత్రాలు తీస్తూ వరుస హిట్లు అందుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ‘మేజర్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న బయోపిక్ లో నటిస్తున్నారు అడివి శేషు. 2008 ముంబై టెర్రర్ అటాక్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను ప్రాణాలను కాపాడారు. ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్, ఎప్లస్ఎస్ మూవీస్ పతాకాలపై నిర్మితమవుతుంది.
కాగా ఈ సినిమాలో శోభితా ధూళిపాల కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా చాలా ఎమోషనల్గా ఉంటుందని చెబుతుంది చిత్రబృందం. మొత్తానికి గూఢచారి తర్వాత శేష్ తో శోభితా ధూళిపాల కలిసి నటిస్తోన్న రెండో చిత్రమిది. ఆ రకంగా హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో ఈ చిత్రం చిత్రీకరణ జరుగుతుంది.