‘భైరవం’ నా కెరీర్ మోస్ట్ మెమరబుల్ మూవీ – హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బీభత్సం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మించారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ బీభత్సం ‘భైరవం’ ప్రెస్ మీట్ నిర్వహించారు.

మనోజ్ గారు సినిమాలో మీ వాయిస్, డిక్షన్ మోహన్ బాబు గారి సిమిలారిటీస్ కనిపించింది? ఇది కావాలని ట్రై చేశారా?
అది ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి. తొమ్మిదేళ్ల తర్వాత ప్రేక్షకులు ముందుకు వచ్చాను. నన్ను ఎంతో గొప్పగా ఆదరించారు. ఈ సందర్భంగా ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను మళ్ళీ ఆశీర్వదించిన సినీ కళామతల్లికి నమస్కరిస్తున్నాను. నేను చేసిన గజపతి క్యారెక్టర్ కి చాలా డెప్త్ ఉంది. ఈ సినిమా కోసం డబ్బింగ్‌కి కష్టపడినంత ఏ సినిమాకి కష్టపడలేదు. డైరెక్టర్ గారు చాలా పవర్ ఫుల్ గా క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఈ సినిమాకి పేరు వచ్చిందంటే దానికి కారణం మా డైరెక్టర్ గారు. ముగ్గురు హీరోలకి సమానంగా పేరు వచ్చింది. ఈ క్రెడిట్ డైరెక్టర్ గారికి దక్కుతుంది.

సాయి గారు.. భైరవం సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది?
ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఇలాంటి కథ దొరికినప్పుడే మన పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉంటుంది. అలాంటి కథ ‘భైరవం’తో రావడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇది నా కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ మూవీ. ఈ సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది. చూసిన ప్రతి ఒక్కరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మా భైరవం థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. తప్పకుండా మీ దగ్గరలో ఉన్న ధియేటర్స్ కి వెళ్లి మా సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా ఇది. మంచి హై తో ఆడియన్స్ బయటకు వస్తారు.

రోహిత్ గారు.. ఈ సినిమాలో మీరు చాలా సెటిల్ గా యాక్ట్ చేశారు.. ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఈ సినిమాకి చాలా మంచి టీం కుదిరింది. విజయ్ కి చాలా క్లారిటీ ఉంది. తనతో మాట్లాడి క్యారెక్టర్ కి తగ్గట్టుగా చేయడం జరిగింది. నిజానికి నేను ఇంత మాస్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. డైరెక్టర్ విజయ కారణంగానే అంతా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ని ఇవ్వగలిగాను. ఇప్పటివరకు సినిమా చూసిన ఆడియన్స్ అందరు కూడా చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. మీరందరు కూడా థియేటర్స్ వెళ్లి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.

రాధా మోహన్ గారు రీరిలీజ్ లు కొత్త సినిమాల పై ఎఫెక్ట్ చూపిస్తాయని భావిస్తున్నారా?
ఎఫెక్ట్ అన్నమాట కొంతవరకు కరెక్టే. కానీ ఏది మనం ఆపలేం. ఈ ట్రెండ్ ఏడాదిగా మొదలైంది. ఒకరు చేస్తున్నారని మరొకరు చేస్తున్నారు. నేను కూడా ‘బెంగాల్ టైగర్’ మళ్ళీ రిలీజ్ చేస్తానేమో. ఎఫెక్ట్ అయితే ఉంటుంది కానీ అల్టిమేట్ గా ఆడియన్స్ ఛాయిస్. దీనిపై చాంబర్లో ఇంకా ఎలాంటి డిస్కషన్ జరగలేదు. అయితే శుక్రవారం కాకుండా సోమవారం చేసుకుంటే బాగుంటుందని ఆలోచన నాకు తట్టింది. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దీనిపై అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి .

అదితి గారు.. ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
ఇంత మంచి టాలెంటెడ్ టీంతో తెలుగు ఇండస్ట్రీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకంటే బెటర్ డెబ్యు మరొకటి ఉండదు. అందరికీ బిగ్ థాంక్స్. మా టీమ్ అందరికీ అభినందనలు.

రోహిత్ గారు.. చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపించారా?
సినిమా నిన్ననే రిలీజ్ అయింది. కచ్చితంగా ఆయనకి ఇన్‌ఫామ్ చేస్తాను. ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూస్తారు.

మనోజ్ గారు.. మీ దగ్గర నుంచి మళ్లీ ఎంటర్టైన్మెంట్ సినిమాని ఆశించవచ్చా ?
నెక్స్ట్ ‘90 ఎం.ఎల్’ ఫేం శేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో సినిమా వస్తుంది. అది హైలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. టైటిల్ కూడా అదిరిపోయింది. త్వరలోనే అనౌన్స్ చేస్తాం.

Exit mobile version