గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా శివ రాజ్ కుమార్ తదితరులు నటిస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే పెద్ది. మరి ఫస్ట్ షాట్ తో మరిన్ని అంచనాలు అందుకున్న ఈ సినిమా తాలూకా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ లు ఉండగా వాటిలో ఓ సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్ ని రామ్ చరణ్ పై మేకర్స్ తెరకెక్కిస్తున్నారట.
ఈ సినిమాలో హైలైట్ ఎపిసోడ్స్ లో ఒకటైన ట్రైన్ ఎపిసోడ్ నే మేకర్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ ఎపిసోడ్ లో అదరగొడుతుండగా బిగ్ స్క్రీన్స్ పై ఈ సన్నివేశం ఆడియెన్స్ కి గట్టి ట్రీట్ ఇస్తుందని టాక్. మరి ఇదెలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.