హరిహర వీరమల్లు వివాదంతో కొంప మునిగింది!

హరిహర వీరమల్లు వివాదంతో కొంప మునిగింది!

Published on Jun 8, 2025 3:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూన్ నెలలో రిలీజ్ అవుతుందని ప్రకటించడంతో ఈ చిత్రంపై డిస్ట్రిబ్యూటర్లు భారీ నమ్మకాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఈ సినిమాతో భారీ లాభాలు వస్తాయని ఆశించారు.

కానీ అందరీ ఆశలపై నీళ్లు జల్లుతూ ఈ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. అయితే దీనిపై పలువురు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సినీ రంగానికి చెందిని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ శ్రీధర్ కూడా ఈ చిత్ర వివాదంపై కామెంట్స్ చేశారు.

బంద్ అనే ఇష్యూ క్రియేట్ చేసింది ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇద్దరు డైరెక్టర్స్ మాత్రమే అని.. హరిహర వీరమల్లు సినిమా ఉందని ప్రతీ థియేటర్ కాలి పెట్టుకున్నాం.. ఇప్పుడు ఈ నెల అంతా పోయిందని.. ఈ ఏడాదిలో సంక్రాంతికి వస్తున్నాం.. కోర్ట్.. మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు మాత్రమే హిట్లు
గా నిలిచాయని ఆయన అన్నారు.

హీరోలకు స్టార్‌డమ్ వచ్చిందే సింగిల్ స్క్రీన్స్ వల్ల అని.. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్‌ను వారు పట్టించుకోవడం లేదని ఆయన మండి పడ్డారు. ఏదేమైనా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు వీరమల్లు సినిమా రిలీజ్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు ఈ తాజా కామెంట్స్ రుజువు చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు