‘వీరమల్లు’ కోసం తెలంగాణ సీఎంని కలవనున్న ఏ ఎం రత్నం!

‘వీరమల్లు’ కోసం తెలంగాణ సీఎంని కలవనున్న ఏ ఎం రత్నం!

Published on May 30, 2025 12:02 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ కం పీరియాడిక్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రంకి తెలంగాణ స్పెషల్ పర్మిషన్స్ కోసం అధికారిక క్లారిటీ బయటకి వచ్చింది.

అక్కడ టికెట్ ధరల హైక్ లు అలాగే అదనపు షోస్ కోసం నిర్మాత ఏ ఎం రత్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు నైజాం లో కూడా ఉదయం 4 గంటలు నుంచే షోస్ పడే టాక్ ఉంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ఈ జూన్ 12న గ్రాండ్ గా సినిమా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు