‘ఘాటీ’ రిలీజ్‌పై టెన్షన్ వద్దంటున్న మేకర్స్

‘ఘాటీ’ రిలీజ్‌పై టెన్షన్ వద్దంటున్న మేకర్స్

Published on Feb 18, 2025 12:16 AM IST

స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండగా పూర్తి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై అంచనాలను రెట్టింపు చేశాయి.

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ సినిమా రిలీజ్‌పై సినీ వర్గాల్లో కొంతమేర సందేహం నెలకొనడంతో ఈ మూవీ వేసవిలో రిలీజ్ అవుతుందో లేదో అనే డౌట్ క్రియేట్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌పై చిత్ర వర్గాలు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు ప్లాన్ ప్రకారం అన్ని అనుకున్నట్లుగా జరుగుతున్నాయని.. వేసవి కానుకగా ఏప్రిల్ 18న ఈ మూవీ కచ్చితంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. దీంతో ఘాటీ రిలీజ్‌పై నెలకొన్న అనుమానాలకు చెక్ పడినట్లు అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు