రిషిత శ్రీ క్రియేషన్స్ మరియు అక్కి ఆర్ట్స్..పతాకం పై….. కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో, నవీన్ చంద్ర పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రల్లో నటిస్తున్న చిత్రం “అర్ద శతాబ్ధం ” రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం గ్లిమ్స్ ను హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు.
కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్పలో వెంకటేష్ కుమారుడిగా నటిస్తున్నాడు, అలాగే అర్థ శతాబ్దం సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ లభించింది, దర్శకుడు రవీంద్ర ఏదయితే స్టోరీ నేరేట్ చేశాడో..దాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ తారాగణం అంతా నటిస్తోన్న ఈ సినిమాకు సంభందించిన మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనుంది.