స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. ఆగస్ట్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది. దాంతో నల్గొండ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
కాగా తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ ఈసారి కూల్ గా తీరిగ్గా కూర్చుని మరీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. ప్రస్తుతం దేవి ఐటమ్ సాంగ్ ను కంపోజ్ చేసే పనిలో ఉన్నాడట. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.