డా. మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ మంచు నిర్మాతగా 1983లో వచ్చిన గోదావరి వరదల నేపధ్యంలో తెరకెక్కించిన సినిమా ‘గుండెల్లో గోదారి’. ఈ సినిమాని తమిళంలో ‘మరంతేన్ మన్నితేన్’ అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ తమిళ సినిమా ఆడియో నిన్న చెన్నైలో పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ ఆడియో వేడుకలో ఈ సినిమాకి సంగీతం అందించిన మాస్ట్రో ఇళయరాజా మాట్లాడుతూ ‘ నాకు తెలిసినప్పటి నుంచి సూపర్ స్టార్ రజినీ కాంత్ మరియు డా. మోహన్ బాబు మంచి స్నేహితులు. సినిమాల్లోకి రాకముందు వారు పాండిబజార్లో నివసిస్తూ ఒక్క పూట కూటి కోసం కూడా ఎంతో కష్ట పడేవారు. ఆ తర్వాత ఇద్దరూ ఎంతో ఉన్నత స్థాయికి వచ్చారు. వారి స్థాయితో పాటే వారి స్నేహం కూడా పెరిగి పెద్దదై, వారిద్దరూ ఎలాంటి భేషజాలు లేకుండా కలిసి ఉండడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని’ ఆయన అన్నారు. ఆది, సందీప్ కిషన్ ,తాప్సీ మరియు లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా కుమార్ నాగేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
వారిద్దరూ ఇప్పటికీ కలిసే ఉండడం నాకు సంతోషం.!
వారిద్దరూ ఇప్పటికీ కలిసే ఉండడం నాకు సంతోషం.!
Published on Oct 31, 2012 3:11 AM IST
సంబంధిత సమాచారం
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- అల్లు అర్జున్ లాంచ్ చేసిన మంచు లక్షి ‘దక్ష’ ట్రైలర్
- ఓటీటీలో రెండు వారాలుగా అదరగొడుతున్న ‘కింగ్డమ్’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆసియా కప్ 2025: షెడ్యూల్, టీమ్లు, మ్యాచ్ సమయాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!