కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు నిర్మాతగా తన తనయుడు మంచు విష్ణు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘దేనికైనా రెడీ’. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని వాటిని తొలగించాలని బ్రాహ్మణులు నిరసనలు తెలుపుతున్నారు. అదీ కాస్త ముదిరి బ్రాహ్మణులు అంతా కలిసి ఈ రోజు మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా చేసారు. అలాగే సినిమాలో ఆ సన్నివేశాలను తొలగించాలని వారు డిమాండ్ చేసారు. రేపటి నుంచి ఆ సన్నివేశాలు ఉంటే కోర్టుకి వెళ్తామని వారు నినాదాలు చేసారు. ధర్నా కాస్తా పెద్దది కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసారు. ఇప్పటికే కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఆ సన్నివేశాలను తొలగించాలని ఫిల్మ్ చాంబర్ కి వినతిపత్రం కూడా సమర్పించారు. స్వతహాగా ఎదుటి వారికి గౌరవం ఇచ్చే డా. మోహన్ బాబు గారు స్పందించి బ్రాహ్మణుల మనోభావాలకు విలువ నిచ్చి ఆ సన్నివేశాలను తొలగిస్తారా లేదా అనే నిర్ణయం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా?
మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా?
Published on Oct 29, 2012 7:26 PM IST
సంబంధిత సమాచారం
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- అల్లు అర్జున్ లాంచ్ చేసిన మంచు లక్షి ‘దక్ష’ ట్రైలర్
- ఓటీటీలో రెండు వారాలుగా అదరగొడుతున్న ‘కింగ్డమ్’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆసియా కప్ 2025: షెడ్యూల్, టీమ్లు, మ్యాచ్ సమయాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!