జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ శుక్రవారం రోజున పెద్ద ఎత్తున కార్యకర్తల సమక్షంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున జనం, పార్టీ నాయకులు హాజరయ్యారు.నామినేషన్ దాఖలు సందర్భంగా తెలంగాణ సంప్రదాయ పండుగలైన బతుకమ్మ, బోనాల కళాకారులు, మహిళల నృత్యాలు మరియు కోయ జాతుల డ్రమ్స్‌తో కోలాహల వాతావరణం కనిపించింది.

నవీన్ యాదవ్ ముందుగా యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ నుంచి శ్రీనగర్ కాలనీ మీదుగా పెద్ద ఊరేగింపుగా బయలుదేరారు. అనంతరం షేక్ పేట్ తాసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి. సాయిరాంకు ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు.

హాజరైన ప్రముఖులు:
నామినేషన్ దాఖలు సమయంలో సీనియర్ నాయకులు వి. హనుమంత రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, కాంగ్రెస్ నాయకురాలు హబీబా సుల్తానా నవీన్ యాదవ్‌తో పాటు ఉన్నారు.

అంతకుముందు జరిగిన భారీ ర్యాలీలో మాజీ ఎంపీ అజహరుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, కార్పొరేటర్లు సి.ఎన్ రెడ్డి, సంగీత యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చివర్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వచ్చి నవీన్ యాదవ్ ను కలవడం మరియు అభినందించడం జరిగింది.

Exit mobile version