తమిళ డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథ్ తెరకెక్కించే సినిమాలకు యూత్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించి, డైరెక్ట్ చేసిన ‘లవ్ టుడే’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా, ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం యూత్ఫుల్ కంటెంట్తో నింపేశారు మేకర్స్. కాలేజీ లైఫ్లో హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.. ప్రేమలో అతనికి ఎదురైన సమస్యలు, వాటి మూలంగా అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్లో చూపెట్టారు. ఇక ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేయగా లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 21న వరల్డ్వైడ్గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి