ఫోటో మూమెంట్: ప్రధాని మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ

అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ తాజాగా న్యూ ఢిల్లీలోని పార్లమెంట్‌లో భారత ప్రధాని మోదీని కలిశారు. ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దివంగత అక్కినేని నాగేశ్వర్ రావు ఇండియన్ సినిమాకు చేసిన సేవలను మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీకి తమ కృతజ్ఞతలు తెలిపేందుకు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు.

ఈ క్రమంలోనే అక్కినినా నాగేశ్వర్ రావుపై బయోగ్రఫీ బుక్‌ని మోదీ ఆవిష్కరించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘అక్కినేని వ్యక్తిత్వ కా విరాట్’ అనే పుస్తకాన్ని మోదీ ఈ సందర్భంగా లాంచ్ చేశారు. ఇక నాగార్జునతో పాటు అక్కినేని అమల, నాగచైతన్య, శోభిత, నాగసుశీల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Exit mobile version