స్టార్ డైరెక్టర్స్ తో ప్రభాస్ నిర్మాతల వెబ్ సిరీస్?

రానున్న కాలం అంతా ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ దే అని తెలుస్తుండగా..ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. కొందరు స్టార్ నిర్మాతలు ఇప్పటికే ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ మొదలు పెట్టారు. అలాగే వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సైతం వెబ్ సిరీస్ లు నిర్మించే ఆలోచన చేస్తున్నారట. దీని కోసం స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరియు సాహూ డైరెక్టర్ సుజీత్ ని కలవడం జరిగిందని టాక్.

ఈ ఇద్దరు దర్శకులతో రెండు భారీ వెబ్ సిరీస్ లు నిర్మించాలనేది వీరి ప్రణాళిక అని తెలుస్తుంది. పూరి మరియు సుజీత్ లాంటి దర్శకులు ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లోకి ఎంటరైతే ఈ విభాగానికి మరింత ఆదరణ మరియు ప్రచారం దక్కడం ఖాయం. ఇక వీరిద్దరితో ఈ ప్రాజెక్ట్స్ ఓకే అయినా ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. పూరి, సుజీత్ తమ తమ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు.

Exit mobile version