వేధింపులకు పాల్పడిన వారిపై కేసుపెట్టిన హీరోయిన్


హీరోయిన్ పూర్ణ కొందరిపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఆమెను కొందరు యవకులు వేధింపులకు గురిచేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. షూటింగ్స్ లేని కారణంగా సొంత రాష్ట్రము కేరళలో ఉంటున్న పూర్ణకు ఈ మధ్య వరుస ఫోన్ కాల్స్ మరియు, మెస్సేజ్ లు వస్తున్నాయట. ఆమె మార్పింగ్ ఫొటోలతో వారు బెదిరింపులకు పాల్పడ్డారట. దీనితో పూర్ణ సైబర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

ఆమె పిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టి..ఫోన్ నంబర్ల ఆధారంగా నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. 2007లో వచ్చిన శ్రీమహాలక్ష్మీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూర్ణ, అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమటపాకాయ్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మంచి హిట్ అందుకుంది. రవిబాబు తెరకెక్కించిన హారర్ మూవీ అవును, అవును 2 చిత్రాలలో నటించింది. ప్రస్తుతం తమిళ మరియు మలయాళ భాషలలో చిత్రాలు చేస్తున్నారు.

Exit mobile version