నేపోటిజం పై అలియా తల్లి కీలక వ్యాఖ్యలు.

హీరో సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ లో పెద్ద ఉద్యమానికి దారితీసింది. బాలీవుడ్ బడా ఫ్యామిలీల కారణంగా అణగదొక్కబడిన చాల మంది నటీనటులు వారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇక నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా గతంలో సుశాంత్ పై అవమానకర వ్యాఖ్యలు చేసిన కరణ్ జోహార్, అలియా వంటి వారిని ట్రోల్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో నేపోటిజం పై వస్తున్న విమర్శలపై అలియా తల్లి సోని రజ్దాన్ స్పందించారు. ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం తెలియజేశారు. ‘ఫలానా వారి కొడుకు, కుమార్తె అంటే ప్రేక్షకులకు వారి మీద చాలా అంచానాలు ఉంటాయి. ఈ రోజు బంధుప్రీతి గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వీరు ఏదో ఒక రోజు తమ సొంత బిడ్డల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. తమ పిల్లలు ఇండస్ట్రీలోకి వస్తామంటే.. ఏం చేస్తారు.. వారిని ఆపగల్గుతారా’ అని సోని రజ్దాన్‌ ప్రశ్నించారు.

Exit mobile version