తెలుగు సినీ పరిశ్రమ నుండి హీరోయిన్ గా ఎదిగిన తెలుగు అమ్మాయి ‘రీతూ వర్మ’. ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ కి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. తెలుగులో కంటే.. తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేయడానికి కారణం ‘పెళ్ళిచూపులు’ తర్వాత తనకు తెలుగులో ఆసక్తికరమైన కథలేవీ దొరకలేదట. అదే సమయంలో తమిళం నుంచి అవకాశాలు వచ్చాయి. ఫలానా భాషలోనే నటించాలి, ఫలానా పాత్రలే చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. అందుకే తమిళంలో చేశాను అని చెప్పింది.
ఇక ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు చేస్తున్నానని.. అందులో శర్వానంద్తో చేస్తున్నది ద్విభాషా చిత్రం కూడా ఉందని తెలిపింది. ఇక సెట్స్ని మిస్ అవుతున్నారా అని అడగగా… మూడు నెలలయ్యింది, మిస్ అవ్వకుండా ఎలా ఉంటాం. ఎప్పుడెప్పుడు సెట్కి వెళదామా? అనిపిస్తోంది. మన చేతుల్లో ఏమీ లేదు కదా. చివరిగా ‘టక్ జగదీష్’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నా. ఆహ్లాదరకమైన వాతావరణం మధ్య చిత్రీకరణ జరిగింది. మళ్లీ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నా’ అని అంది.
ఈ మధ్య పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అందరూ అడుగుతున్నారు. అమ్మానాన్నలు కూడా నేనెప్పుడు పెళ్లి చేసుకుంటానా? అని ఎదురు చూస్తున్నారు. దానికి చాలా సమయం ఉందని చెబుతుంటా. అని నవ్వుతూ చెప్పుకొచ్చింది ఈ తెలుగు హీరోయిన్.