పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్న పవన్

విపత్కర పరిస్థితులలో ప్రజలను, ప్రభుత్వాలను ఆదుకోవడానికి మేమున్నాం అని భరోసా ఇస్తుంటారు టాలీవుడ్ హీరోలు. వారి వంతు ఆర్థిక సాయం చేస్తూ సామజిక బాధ్యత నెరవేర్చుతూ ఉంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో మన టాలీవుడ్ హీరోలు ముందుకు వచ్చారు. కరోనా పై యుద్ధంలో ప్రభుత్వాలకు మద్దతుగా ఆర్ధిక సాయం ప్రకటించారు.

ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్ ఇలా టాలీవుడ్ నుండి ఇంకా చాల మంది హీరోలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. ఈ స్పందనకు ప్రతిగా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతఙ్ఞతలు తెలిపారు. ఆయన సోషల్ మీడియా వేదికగా వారి సాయాన్ని అభినందించారు. ఇక పవన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి 2 కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version